మద్యం మత్తులో అనేక నేరాలు జరుగుతున్నాయి: Dwarka Tirumala Rao
ABN, First Publish Date - 2022-06-09T18:42:46+05:30
మద్యం మత్తులో అనేక నేరాలు జరుగుతున్నాయని ద్వారకా తిరుమల రావు అన్నారు.
Vijayawada: మద్యం మత్తులో అనేక నేరాలు జరుగుతున్నాయని ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు (Dwarka Tirumala Rao) అన్నారు. గురువారం ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) మద్య విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో ఆయన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఆ సందర్భంగా ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్లలో, బస్సుల్లో మద్య విమోచన పోస్టర్స్ను అతికించనున్నామని, ఆర్టీసీ డ్రైవర్లతో పాటు మిగిలిన సిబ్బందిని ఖచ్చితంగా బ్రీత్ ఎనలైజర్తో ఆల్కహాల్ తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. మద్యం సేవించి వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేవలం ఆర్టీసీలోనే కాదని... ఈ తనిఖీలు మిగిలిన ప్రైవేట్ ట్రావెల్స్లో కూడా జరుగుతాయన్నారు. మద్య విమోచన ప్రచార కమిటీతో కలిసి పని చేయబోతున్నామని ద్వారకా తిరుమల రావు స్పష్టం చేశారు.
Updated Date - 2022-06-09T18:42:46+05:30 IST