తిరువూరులోని సమస్యలపై సీపీఐ ఆందోళన
ABN, First Publish Date - 2022-06-29T06:07:35+05:30
పట్టణంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ సీపీఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు.
తిరువూరు, జూన్ 28: పట్టణంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ సీపీఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. పట్టణ కార్యదర్శి కొత్తపల్లి సుందరరావు మాట్లాడుతూ, పట్టణంలో పలు రహదారులకు ఇరువైపులా డ్రెయిన్ సౌకర్యం లేక మురుగునీరు నివాసాలమధ్య నిలిచిపోతుందన్నారు. వర్షాకాలంలో అంటువ్యాదుల బారినపడే ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయని హెచ్చరించారు. రోడ్లు గోతులమయంగా మారి తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్ కమిషనర్ శర్మకు అందించారు. నాయకులు సుభాని, ముత్తయ్య, అశోక్, ప్రసాదు, వెంకటేశ్వరరావు, నాగులుమీరా, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-06-29T06:07:35+05:30 IST