ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చింతలపూడి ఎత్తిపోతలను పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2022-05-25T06:01:20+05:30

చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను తక్షణం ప్రారంభించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన నిర్వహించారు.

ఆందోళన చేస్తున్న నాయకులు, రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన

రెడ్డిగూడెం, మే 24: చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను తక్షణం ప్రారంభించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన నిర్వహించారు. రెడ్డిగూడెం ప్రధాన సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.వి.ఆంజనేయులు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, రైతాంగానికి గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా పేరుతో ప్రభుత్వం రైతులను  మోసం చేస్తుందన్నారు. చింతలపూడికి నిధులు కేటాయించి ఎప్పటి లోగా పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మద్దిరెడ్డి మాధవరెడ్డి, రైతు సంఘం మండల నాయకుడు మోహన్‌రెడ్డి, అప్పిరెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-25T06:01:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising