ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిల్లు కట్టమంటే దాడికి యత్నం..!

ABN, First Publish Date - 2022-09-19T06:25:58+05:30

విద్యుత్‌ బిల్లు బకాయిలు చెల్లించాలని కోరిన ట్రాన్స్‌కో సిబ్బందిపై వైసీపీ నేత, పంచాయతీ వార్డు సభ్యుడు దాడికి యత్నించిన ఘటనపై శనివారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  వైసీపీ నేతపై విద్యుత్‌ సిబ్బంది ఫిర్యాదు

కేసు నమోదు

కంచికచర్ల, సెప్టెంబరు 18 : విద్యుత్‌ బిల్లు బకాయిలు చెల్లించాలని కోరిన ట్రాన్స్‌కో సిబ్బందిపై వైసీపీ నేత, పంచాయతీ వార్డు సభ్యుడు దాడికి యత్నించిన ఘటనపై శనివారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. కంచికచర్లలో విద్యుత్‌ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా పట్టణంలో బకాయిలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం నలుగురు సిబ్బంది స్థానిక సంజీవ్‌నగర్‌ కాలనీలోని బి.స్వరూపరాణి పేరుతో ఉన్న సర్వీస్‌ నెంబరు 6311622000867పై బకాయిలు చెల్లించాలని కోరారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్వరూపరాణి భర్త, వైసీపీ నేత, 20వ వార్డు సభ్యుడు అయిన బి.శంకర్రావు అతడి కొడుకుతో కలిసి విద్యుత్‌ సిబ్బందిపై అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి దిగారు. ఈ పరిణామానికి భీతిల్లిన విద్యుత్‌ సిబ్బంది విషయాన్ని పై అధికారులకు తెలిపారు. తమ విధులకు ఆటంకం కలిగించటమే కాకుండా బండరాయి, కర్రతో దాడికి ఉపక్రమించి చంపుతామని బెదిరించారని విద్యుత్‌ సిబ్బంది పోలీసులకు శనివారం రాత్రి ఫిర్యాదు చేశారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.


Updated Date - 2022-09-19T06:25:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising