ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలను మోసం చేసిన జగన్‌: ఎమ్మెల్యే గద్దె

ABN, First Publish Date - 2022-08-13T05:52:41+05:30

తనను గెలిపిస్తే మహిళలకు అండగా ఉంటానని చెప్పిన జగన్‌ గెలిచిన తరువాత మోసం చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మండిపడ్డారు.

గద్దె రామ్మోహన్‌కు రాఖీలు కడుతున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళలను మోసం చేసిన జగన్‌: ఎమ్మెల్యే గద్దె

రాణిగారితోట, ఆగస్టు 12: తనను గెలిపిస్తే మహిళలకు అండగా ఉంటానని చెప్పిన జగన్‌ గెలిచిన తరువాత మోసం చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మండిపడ్డారు. రాణిగారితోటలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించి స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జగనన్న వస్తున్నాడని మంచి రోజులు వస్తాయని దీర్ఘాలు తీసిన ప్రజలు జగన్‌ గెలిచిన తరువాత మంచి రోజులు తీసుకురావడం దేవుడెరుగు ఽధరలు పెంచి అక్కచెల్లెమ్మలు వంటగదికి వెళ్లేందుకు భయపడే రోజులు తెచ్చాడని విమర్శించారు. జగన్‌ కుటుంబసభ్యులు తయారుచేసే కల్తీ మద్యం ద్వారా మహిళల తాళిబొట్లు తెంచుతున్నారని, కరెంటు చార్జీలు పెంచి ఫ్యాన్‌ కు ఓటు వేసినందుకు ఇంట్లో ఫ్యాన్‌ వేసుకునే అవకాశాన్ని కాలరాశాడన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిన జగన్‌కు బుద్ధి చెప్పేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సందర్భంగా 18వ డివిజన్‌ కు చెందిన కరీముల్లాకు టిఫిన్‌ బండిని అందజేశారు. అనంతరం స్థానికంగా పార్టీకి చెందిన మహిళలు గద్దె రామ్మోహన్‌కు రాఖీ కట్టారు.  ఈ కార్యక్ర మంలో వేముల దుర్గారావు, కొక్కెర తిరుపతయ్య, పీరుబాబు, రాయి రంగమ్మ, మొకర వెంకటరమణ, పగడాల వెంకటేశ్వరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-08-13T05:52:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising