AP News: ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొట్టు
ABN, First Publish Date - 2022-09-26T21:58:05+05:30
Vijayawada: దసరా ఉత్సవాల నేపథ్యంలో మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu Satynarayana) ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను పరిశీలించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామని, ఆన్లైన్ టికెటింగ్లో పొరపాట్లను సరిచేస్తున్నామని మంత్రి చెప్పారు. ‘ఏర్పాట్లు బాగున్నాయని దేవినేని ఉమ నాతో అన్నారు. మీడియాతో మాత్రం ఏర్పాట్లు బాగాలేవనడం విడ్డూరంగా ఉంది. దసరా వేడుకలకు ఉత్సవ కమిటీ అవసరం లేదని భావిస్తున్నాం. అవసరమైతే పరిశీలిస్తాం
Vijayawada: దసరా ఉత్సవాల నేపథ్యంలో మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu Satynarayana) ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను పరిశీలించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామని, ఆన్లైన్ టికెటింగ్లో పొరపాట్లను సరిచేస్తున్నామని మంత్రి చెప్పారు. ‘ఏర్పాట్లు బాగున్నాయని దేవినేని ఉమ నాతో అన్నారు. మీడియాతో మాత్రం ఏర్పాట్లు బాగాలేవనడం విడ్డూరంగా ఉంది. దసరా వేడుకలకు ఉత్సవ కమిటీ అవసరం లేదని భావిస్తున్నాం. అవసరమైతే పరిశీలిస్తాం’’ అని మంత్రి పేర్కొన్నారు.
Updated Date - 2022-09-26T21:58:05+05:30 IST