ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణానదిలో ముగ్గురు గల్లంతు

ABN, First Publish Date - 2022-08-20T02:20:09+05:30

కృష్ణానది (Krishna River)లో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు గల్లంతయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇబ్రహీంపట్నం: కృష్ణానది (Krishna River)లో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు గల్లంతయ్యారు. ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam)లోని పవిత్ర సంగమంలో సరదాగా స్నానం చేసేందుకు ఆరుగురు ఎనిమిదో తరగతి విద్యార్థులు వెళ్లారు. వారు స్నానం చేస్తుండగా, వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో నలుగురు సురక్షితంగా బయటపడగా, ఒక విద్యార్థిని వాకింగ్‌కు వచ్చిన యువకుడు కాపాడాడు. మరో విద్యార్థి ఉప్పలపాటి లోకేశ్‌ (13) మాత్రం నదిలో కొట్టుకుపోయాడు. లోకేశ్‌ కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ (NDRF), పోలీస్‌, గజ ఈతగాళ్లు వెతుకుతున్నారు. అలాగే, మోపిదేవి మండలంలోని కోసూరువారిపాలెంలో ఎడ్లబండిని శుభ్రం చేసేందుకు నలుగురు యువకులు కృష్ణానదిలోకి వెళ్లగా, వరద ఒక్కసారిగా పెరిగింది. నలుగురిలో ఇద్దరికి ఈత రావడంతో సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. శుక్రవారం రాత్రి వరకు కూడా కాగితాల హసంత్‌ (22), మేకా వెంకటేశ్‌ (20) ఆచూకీ తెలియలేదు. 

Updated Date - 2022-08-20T02:20:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising