ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బంగారు బాపట్ల’గా అభివృద్ధి చెందాలి: కోనా రఘుపతి

ABN, First Publish Date - 2022-04-09T02:53:48+05:30

గతంలో స్వామిని దర్శించుకున్నప్పుడు బాపట్లను ప్రత్యేక జిల్లాగా మారాలని కోరుకుని వెళ్లా. మొత్తానికి స్వామి అనుగ్రహంతో సీఎం జగన్మోహన్‌రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: ‘గతంలో స్వామిని దర్శించుకున్నప్పుడు బాపట్లను ప్రత్యేక జిల్లాగా మారాలని కోరుకుని వెళ్లా. మొత్తానికి స్వామి అనుగ్రహంతో సీఎం జగన్మోహన్‌రెడ్డి ద్వారా బాపట్ల నూతన జిల్లాగా ఏర్పడింది’ అని డిప్యూటీ స్పీకర్‌, బాపట్ల ఎమ్మెల్యే కోనా రఘుపతి సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ఓ శాసనసభ సభ్యుడిగా తాను బాపట్ల ప్రజలకు ఇంతకన్నా గొప్ప గిఫ్ట్‌ ఇవ్వలేకపోవచ్చన్నారు. నూతన ఏర్పడిన బాపట్ల.. బంగారు బాపట్లగా అభివృద్ధి చెందాలని స్వామిని కోరుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మంచి పరిపాలన జరుగుతోందన్నారు. సీఎంకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్టు చెప్పారు. 

Updated Date - 2022-04-09T02:53:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising