ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ ప్రభుత్వం బీసీల కడుపు కొడుతోంది: కొల్లు రవీంద్ర

ABN, First Publish Date - 2022-04-18T20:15:25+05:30

జగన్ ప్రభుత్వం బీసీల కడుపు కొడుతోందని.. గతంలో బీసీలకు అన్నిరంగాల్లో టీడీపీ పెద్దపీట వేసిందని టీడీపీ ఏపీ బీసీ సెల్ అధ్యక్షుడు కొల్లు రవీంద్ర అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జగన్ ప్రభుత్వం బీసీల కడుపు కొడుతోందని.. గతంలో బీసీలకు అన్నిరంగాల్లో టీడీపీ పెద్దపీట వేసిందని టీడీపీ ఏపీ బీసీ సెల్ అధ్యక్షుడు కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం శ్రీ క్రిష్ణ దేవరాయ ధర్నా‌చౌక్ లో  మత్స్యకార జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో  కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మత్స్యకారుల జీవన ఉపాధిపై దెబ్బకొట్టే 217 జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ అన్నిరంగాల్లోని బీసీలను అణచివేస్తున్నారని మండిపడ్డారు. పేరుకే బీసీ మంత్రులు..  కేబినెట్‌లో ఏమాత్రం పవర్ లేనందున బీసీలకు మంత్రులు న్యాయం చేయలేకపోతున్నారని చెప్పారు. జగన్ భజన చేసే వారికి మంత్రి పదవులు ఇచ్చారన్నారు. సొంత కాళ్లపై బతికే మత్య్సకారులను జగన్ రోడ్డున బిచ్చమెత్తుకునేలా చేశారని ధ్వజమెత్తారు. త్వరలో ఈ ఉద్యమాన్ని విజయవాడ, విశాఖ కేంద్రంగా తీవ్రతరం చేయబోతున్నామని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ దీక్షలో టీడీపీ  ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు. బీజేపీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఈ దీక్షకు మద్దతు తెలిపారు. 

Updated Date - 2022-04-18T20:15:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising