వివేకా హత్యపై జగన్ తీరు దారుణం: కాశీభట్ల సాయినాథ్శర్మ
ABN, First Publish Date - 2022-03-01T00:23:18+05:30
వైఎస్ వివేకా హత్యకు సంబంధించి సునీత సీఎం జగన్కు చెపితే ఆయన స్పందించిన తీరు దారుణమని టీడీపీ రాష్ట్రకార్యదర్శి కాశీభట్ల సాయినాథ్శర్మ అన్నారు.
కడప: వైఎస్ వివేకా హత్యకు సంబంధించి సునీత సీఎం జగన్కు చెపితే ఆయన స్పందించిన తీరు దారుణమని టీడీపీ రాష్ట్రకార్యదర్శి కాశీభట్ల సాయినాథ్శర్మ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తండ్రిని కోల్పోయిన చెల్లెలను ఓదార్చాల్సింది పోయి తప్పులు చేసిన తమ్ముడు అవినాశ్రెడ్డికి సపోర్టుగా మాట్లాడడం సీఎంగా జగన్కి సిగ్గుచేటన్నారు. వివేకా హత్యకు సంబంధించి సీఎం జగన్ స్పందించే తీరు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని చెప్పారు.తన సమీప బంధువులే సీబీఐకిచ్చిన వాంగ్మూలాలు వెలుగులోకి వస్తుంటే.. సీఎం జగన్ స్పందించక పోవడం..సీఎంగా ప్రమాణాన్ని ఉల్లంఘించడమేనని చెప్పారు. వివేకా హత్యపై సీబీఐ విచారణ కావాలన్న జగన్ అధికారం వచ్చాక సీబీఐ విచారణ వద్దని వెనక్కి తీసుకోవడం వెనుక కారణాలను జగన్ ప్రజలకు బహిరంగంగా తెలపాలని సాయినాథ్శర్మ అన్నారు.
Updated Date - 2022-03-01T00:23:18+05:30 IST