Madanapalle లాడ్జీలో కర్ణాటక మహిళ మృతి.. అంతకుముందు రోజు రాత్రే..!
ABN, First Publish Date - 2022-01-09T13:11:38+05:30
అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందింది...
చిత్తూరు జిల్లా/మదనపల్లె క్రైం : అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందింది. మదనపల్లె టూటౌన్ పోలీసుల కథనం మేరకు... కర్ణాటక రాష్ట్రం ముళబాగల్కు చెందిన గీత(40) ఈనెల 6న గురువారం బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తితో కలసి మదనపల్లెకు వచ్చింది. ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఓ లాడ్జీలో గదిని అద్దెకు తీసుకున్నారు. శనివారం ఉదయం ఎంతసేపటికీ గది తలుపు తెరవకపోవడంతో లాడ్జీ సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో పోలీసులు తలుపు గడియ తొలగించి లోనికెళ్లి చూడగా మహిళ మృతదేహం మంచం కిందపడి ఉంది.
లాడ్జీ మేనేజర్, రూంబాయ్ను విచారించారు. ఈక్రమంలో రిజిస్టర్లో నమోదు చేసిన మొబైల్ నెంబర్ ఆధారంగా గీత కుటుంబీకులకు సమాచారం అందించారు. అయితే మహిళతో పాటు కలసి వున్న వ్యక్తి శుక్రవారం రాత్రే గది నుంచి వెళ్లిపోయాడని లాడ్జీ సిబ్బంది చెప్పారు. ముళబాగల్, బెంగళూరుల్లో నిందితుడి కోసం గాలిస్తున్నారు. పైగా అతడి మొబైల్ స్విచ్ఛాప్లో ఉందని పోలీసులు చెబుతున్నారు. అనంతరం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు ఎస్ఐ చంద్రమోహన్ చెప్పారు.
Updated Date - 2022-01-09T13:11:38+05:30 IST