కారును ఢీకొన్న Karnataka RTC బస్సు... ఇద్దరు మృతి
ABN, First Publish Date - 2022-06-03T14:38:51+05:30
జిల్లాలోని చిలమత్తూరు మండలం కొడికొండ చెక్పోస్టు సమీపంలో కారును కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
శ్రీ సత్యసాయి: జిల్లాలోని చిలమత్తూరు మండలం కొడికొండ చెక్పోస్టు సమీపంలో కారును కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కేఎస్ ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2022-06-03T14:38:51+05:30 IST