కాపు ముఖ్యనాయకుల భేటీ.. ఐక్యవేదిక ఏర్పాటుకు నిర్ణయం
ABN, First Publish Date - 2022-01-24T03:20:54+05:30
కాపు ముఖ్యనాయకులు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. విజయవాడలో భేటీ కావాలని ముందుగా నిర్ణయించారు. అయితే..
అమరావతి: కాపు ముఖ్యనాయకులు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. విజయవాడలో భేటీ కావాలని ముందుగా నిర్ణయించారు. అయితే కరోనా థర్డ్ వేవ్తో వర్చువల్లో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి 16 మంది నేతలు హాజరయ్యారు. సుమారు రెండు గంటల పాటు ఈ సమావేశం సాగింది.
అన్ని కులాలను కలుపుకుని ముందుకు వెళ్లాలని మెజార్టీ సభ్యులు సూచనలు చేశారు. అన్ని కులాలను కలుపుకుని ఐక్యవేదిక ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. దళితులు, వెనకబడిన వర్గాల ముఖ్యనేతలతో టచ్లో ఉన్న కాపు ముఖ్యనేతలు ఫిబ్రవరి రెండవ వారంలో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. విజయవాడలో సమావేశం అయ్యేందుకు సూత్రపాయంగా అంగీకారం తెలిపారు.
ఆ సమావేశంలో కోర్ కమిటీ వేయాలని సూచనలు చేశారు. అయితే ఈ సమావేశానికి వైసీపీలో ఉన్న కాపు నేతలు దూరంగా ఉన్నారు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, వట్టి వసంతకుమార్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రామ్మోహాన్, ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు, ముద్రగడ్డ అనుచరుడు ఆరేటి ప్రకాశ్ తదితరులు హాజరయ్యారు.
Updated Date - 2022-01-24T03:20:54+05:30 IST