అంధకారంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు: కనకమేడల
ABN, First Publish Date - 2022-02-11T19:20:15+05:30
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారంగా మారిందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారంగా మారిందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం రాజ్యసభలో బడ్జెట్పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తూ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సర్కార్ చేస్తున్న రుణాలు అన్నింటిపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏపీలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని కనకమేడల పేర్కొన్నారు.
Updated Date - 2022-02-11T19:20:15+05:30 IST