Jaganపై మండిపడ్డ కాలవ శ్రీనివాసులు
ABN, First Publish Date - 2022-06-11T20:16:00+05:30
సీఎం జగన్ జిల్లా పర్యటనపై మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
అనంతపురం: సీఎం జగన్ జిల్లా పర్యటనపై మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు పంట పరిహారం చెల్లించని జగన్ రెడ్డి.. ఏం మొఖం పెట్టుకుని జిల్లా పర్యటనకు వస్తున్నారని ప్రశ్నించారు. రూ.1,250 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా రైతులను మోసం చేశారని దుయ్యబట్టారు. మూడేళ్లుగా రూ.4 వేల కోట్లు పరిహారం ఇవ్వకుండా దగా చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు డ్రిప్ పరికరాలు ఇవ్వాలంటూ.. ఈనెల 13న జిల్లా చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తామని కాలవ శ్రీనివాసులు ప్రకటించారు.
Updated Date - 2022-06-11T20:16:00+05:30 IST