ప్రజల చేతుల్లో వైసీపీకి బాదుడు తప్పదు: టీడీపీ
ABN, First Publish Date - 2022-05-18T05:17:22+05:30
ప్రజల చేతుల్లో వైసీపీకీ త్వరలో బాదుడు తప్పదని టీడీపీ మండల కన్వీనర్ కె.విజయభాస్కర్రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మల్లిఖార్జునరెడ్డి పేర్కొన్నారు.
చెన్నూరు, మే 17: ప్రజల చేతుల్లో వైసీపీకీ త్వరలో బాదుడు తప్పదని టీడీపీ మండల కన్వీనర్ కె.విజయభాస్కర్రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మల్లిఖార్జునరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం చెన్నూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ ప్రభుత్వం నిత్యావసర ధరలను పెంచి పేదలకు తీవ్రమైన అన్యాయం చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చాక ఒక మాట, రాక ముందు ఒక మాట మాట్లాడి నియంత పాలన సాగిస్తున్నారని, ఇది రాష్ట్రానికి పట్టిన దరిద్రమన్నారు.కమలాపురం నియోజకవర్గ కేంద్రంలో బుధవారం జరిగే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మం డలం నుంచి సుమారు 2 వేల మందితో తరలి వెళుతున్నామన్నారు. అలాగే ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహిస్తామ న్నారు.మండల కార్యదర్శి ఖాజాహుసేన, బీసీసెట్ అధ్యక్షుడు కుందేటి కృష్ణయ్య, మైనార్టీ నేతలు గౌస్పీర్, బాలకృష్ణారెడ్డి, శ్రీనాథ్రెడ్డి, జి. శ్రీనివాసులు, షబ్బీర్, కొండపేట గౌస్, రాము తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-18T05:17:22+05:30 IST