ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ వర్గీయులపై వైసీపీ నేతల దాడి

ABN, First Publish Date - 2022-08-08T04:57:20+05:30

రాజుపాళెం మండలంలో ఐదుగురు టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దాడిచేసి గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు.

గాయపడిన మీరారెడ్డి, సుబ్బమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు రూరల్‌, ఆగస్టు 7: రాజుపాళెం మండలంలో ఐదుగురు టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దాడిచేసి గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం సిద్దమూర్తి చంద్రశేఖర్‌రెడ్డి తన పొలంలో మొక్కలు నాటుతుండగా తమకూ హక్కు ఉందంటూ వైసీపీ నేత పోకల శ్రీనివాసుల రెడ్డి తన వర్గీయులతో కలిసి వాగ్వాదపడినట్లు బాధితులు తెలిపారు. వారి నడుమ మాటా మాట పెరిగి దాడికి దిగినట్లు ఆరోపించా రు. తమకు చెందిన పొలంలో వారికి హక్కు లేదని వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడి దాడి చేశారని బాధితులు వివరించారు.

దాడుల్లో చంద్రశేఖర్‌రెడ్డి, సుబ్బమ్మ, మీరారెడ్డి, గోపిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి గాయాల పాలయ్యారు. బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా ప్రథమచికిత్స అనంతరం మెరగైన వైద్యం కోసం కడపకు తరలించారు. ఈ ఘటనపై పోకల శ్రీనివాసుల రెడ్డి, ఆయన వర్గీయులతో దాడి చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు విచారించి కేసు నమోదు చేస్తామన్నారు.

Updated Date - 2022-08-08T04:57:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising