అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ABN, First Publish Date - 2022-07-02T05:26:34+05:30
రాయచోటి పట్టణంలోని సరస్వతీనగర్లో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది.
రాయచోటిటౌన్, జూలై 1: రాయచోటి పట్టణంలోని సరస్వతీనగర్లో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని సరస్వతీనగర్లో నివాసం ఉంటున్న బుక్కే సాలమ్మ (50) శుక్ర వారం ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈమెకు ఇరువురు కుమార్తెలు ఉండగా, వారు బయటికి వెళ్లి ఇంటికి తిరిగొచ్చే సరికి తల్లి మృతి చెందినట్లు తెలిపారు. ఈమేరకు అర్బన్ సీఐ సుధాకర్రెడ్డి, ఎస్ఐ నరసింహా రెడ్డిలు సంఘటనా స్థలానికి వెళ్లి... పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఈవిషయమై ఇంకా ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Updated Date - 2022-07-02T05:26:34+05:30 IST