ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈతకు వెళ్లి యువకుడి మృతి

ABN, First Publish Date - 2022-05-18T05:30:00+05:30

కొత్తపల్లె దర్గా సమీప బావి కి ఈత కోసం వెళ్లిన సయ్యద్‌(20) మృత్యువాత పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది.

వెలికి తీసిన సయ్యద్‌ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచోటిటౌన్‌, మే18: కొత్తపల్లె దర్గా సమీప బావి కి ఈత కోసం వెళ్లిన సయ్యద్‌(20) మృత్యువాత పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే..  సిబ్యాల వాసి నజీర్‌ కుమారుడు సయ్యద్‌, మరో ఆరుగురు స్నేహహితులతో కలిసి గ్రామంలోని చెరువు సమీప బావిలో ఈదలాడేందుకు మంగళ వారం సాయంత్రం వెళ్లారు. చీకటి పడే వరకు బా విలో ఈత కొడుతుండగా సయ్యద్‌ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి బయటకు రాలేకపోయాడు. దీంతో భయాందోళనకు గురైన వారు ఇంటికి వచ్చి జరిగిన సంఘటన కుటుంబ సభ్యులకు తెలిపారు.

వారు వెంటనే పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికా రులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక అధికారి భీమలింగయ్య ఆధ్వర్యంలో సిబ్బం ది బావి వద్దకు వెళ్లి మృతదేహం కోసం వెదికినా  ఫలితం లేకపోయింది. బుధవారం ఉదయం తిరిగి మృతదేహం కోసం గాలింపు చేపట్టి ఎట్టకేలకు మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ మేరకు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్‌ సీఐ సుధాకర్‌రెడ్డి తెలియజేశారు. 

Updated Date - 2022-05-18T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising