ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ను సాగనంపేందుకు సిద్ధం కావాలి

ABN, First Publish Date - 2022-09-26T04:46:00+05:30

అవినీతి, అసమర్థ, అరాచక పాలన చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని సాగనంపేందుకు సమయం ఆసన్నమవుతోందని బీజేపీ రాయలసీమ ఇన్‌చార్జి పనతల సురేష్‌ తెలిపారు.

విలేకర్లతో మాట్లాడుతున్నరాయలసీమ బీజేపీ ఇన్‌చార్జి పనతల సురేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ రాయలసీమ ఇన్‌చార్జి పనతల సురేష్‌

రాజంపేట, సెప్టెంబరు 25 : అవినీతి, అసమర్థ, అరాచక పాలన చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని సాగనంపేందుకు సమయం ఆసన్నమవుతోందని బీజేపీ రాయలసీమ ఇన్‌చార్జి పనతల సురేష్‌ తెలిపారు. రాజంపేట బీజేపీ కార్యాల యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లా డుతూ జగన్‌మోహన్‌రెడ్డి అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీజేపీ ప్రజాపోరు యాత్రలో ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఎన్నికల ముందర ఇచ్చిన వాగ్దానాలకు,  అమలు చేస్తున్న పథకాలకు పొంతన లేకుండా పోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను తమ పథకాలుగా గొప్పలు చెప్పుకుంటూ పబ్బం గడుపుతూ స్టిక్కర్‌ ప్రభుత్వంగా మారిందన్నారు. బీజేపీ ప్రజాపోరు యాత్రలో భాగంగా రాయలసీమలో 2,951 సభలు నిర్వహించి 10.76 లక్షల మందికి జగన్‌ అరాచక పాలన గురించి వివరించామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి పోతుగుంట రమేష్‌నాయుడు, బీజేపీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ, నాగ రాజు, నగేష్‌, సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-26T04:46:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising