AP News: కడపలో బార్ల కోసం వైసీపీ నేతల మధ్య వార్
ABN, First Publish Date - 2022-07-30T20:26:13+05:30
కడపలో బార్ల కోసం వైసీపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. అధికార పార్టీ నేతల మధ్య నువ్వా -నేనా అన్న స్థాయిలో వేలం పాట జరుగుతోంది.
అమరావతి: కడపలో బార్ల కోసం వైసీపీ నేతల(YCP Leaders) మధ్య వార్ నడుస్తోంది. అధికార పార్టీ నేతల మధ్య నువ్వా -నేనా అన్న స్థాయిలో వేలం పాట జరుగుతోంది. బార్ల లైసెన్స్ (Bar license) కోసం వేలం పాట రూ. కోటి దాటింది. కడపలో ఒక బార్ లైసెన్స్కు రూ. కోటి 71 లక్షలకు వైపీసీ నేత వేలం పాట పాడారు. కడపలో మిగతా బార్లకు 90 శాతం చెల్లించాల్సి ఉంటుంది. తిరుపతిలో అత్యధికంగా రూ. కోటి 59 లక్షలు ధర పలికింది. ప్రొద్దుటూరులో రూ. కోటి 31 లక్షలు, అనంతపురంలో రూ. కోటి 05 లక్షలకు వేలం పాట పలికింది. రాయలసీమలో 4, ఉత్తరాంధ్రలో 3 జిల్లాల బార్లకు ఈ వేలం కొనసాగుతోంది.
Updated Date - 2022-07-30T20:26:13+05:30 IST