వీఆర్వో సంఘం ఎన్నిక ఏకగ్రీవం
ABN, First Publish Date - 2022-04-25T04:48:56+05:30
ఏపీ వీఆర్వో అసోసియేషన్ కడప జిల్లా ఎన్నికలు ఆదివారం జరిగా యి. వైఎస్సాఆర్ జిల్లా వీఆర్వో సంఘం అధ్యక్షుడి గా మస్తాన్ వలి, ప్రధాన కార్యదర్శిగా దేవానంద్మరో 22 మంది కార్యవర్గ సభ్యులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అధ్యక్ష, కార్యదర్శులుగా మస్తాన్ వలి, దేవానంద్
కడప(కలెక్టరేట్) ఏప్రిల్ 24: ఏపీ వీఆర్వో అసోసియేషన్ కడప జిల్లా ఎన్నికలు ఆదివారం జరిగా యి. వైఎస్సాఆర్ జిల్లా వీఆర్వో సంఘం అధ్యక్షుడి గా మస్తాన్ వలి, ప్రధాన కార్యదర్శిగా దేవానంద్మరో 22 మంది కార్యవర్గ సభ్యులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో 36 మండలాల వీఆర్వోలు పాల్గొనగా, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు బాలా జీ రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. రాష్ట్ర అద్యక్షుడు రవీంద్ర రాజు మాట్లాడు తూ వీఆర్వో సమస్యపై కొన్నేళ్లుగా పదోన్నతుల కోసం పోరాడాల్సి వస్తుందని ఆవేదన వ్య క్తం చేశారు. వీఆర్వో సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు సమష్టిగా కృషి చేద్దామన్నారు. సహకరించిన కార్యవర్గానికి, వీఆర్వోలకు అధ్యక్ష, కార్యదర్శులుగా నియమితులైన మస్తాన్ వలి, దేవానంద్ ధన్యవాదాలు తెలిపారు.
Updated Date - 2022-04-25T04:48:56+05:30 IST