ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజంపేటను జిల్లాగా ప్రకటించే వరకు తగ్గేదేలా....

ABN, First Publish Date - 2022-02-01T05:01:46+05:30

రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు తగ్గేదేలా అంటూ జేఏసీ నేతలు పేర్కొన్నారు. సోమవారం చిట్వేలి జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, స్వచ్ఛం ద సంస్థల వారు నిరసన వ్యక్తం చేశారు.

చిట్వేలిలో నిరసన వ్యక్తం చేస్తున్న చిట్వేలి జేఏసీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిట్వేలి, జనవరి 31 : రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు తగ్గేదేలా అంటూ జేఏసీ నేతలు పేర్కొన్నారు. సోమవారం చిట్వేలి జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, స్వచ్ఛం ద సంస్థల వారు  నిరసన వ్యక్తం చేశారు. చిట్వేలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నుంచి వైఎస్సార్‌ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించి, మానవహారంగా ఏర్పడ్డారు. తహసీల్దారు కార్యాలయంలో వినతిపత్ర సమర్పించి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ చారిత్రాత్మక ప్రాధాన్యం, సౌకర్యాలు  ఉన్న ప్రాంతాన్ని కాదని వేరే చోట జిల్లా కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పా టు చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాయచోటి వద్దు-రాజంపేట ముద్దు అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, వామపక్ష నాయకులు మానవతా, సీహెఛ్‌ఎ్‌స, శివశక్తి, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-02-01T05:01:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising