వైసీపీ నీచరాజకీయాలకు ముగింపు తప్పదు
ABN, First Publish Date - 2022-09-30T05:22:58+05:30
రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న నీచరాజకీ యాలకు ప్రజలే బుద్దిచెబుతారని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్ కుమారుడు దొమ్మలపాటి యశశ్విరాజ్ పేర్కొన్నారు.
మదనపల్లె టౌన్, సెప్టెంబరు 29: రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న నీచరాజకీ యాలకు ప్రజలే బుద్దిచెబుతారని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్ కుమారుడు దొమ్మలపాటి యశశ్విరాజ్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం మండలంలోని కోళ్లబైలు గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు డి.శ్రీనివా సు లు ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యశశ్విరాజ్ మాట్లాడుతూ గ్రామాల్లో అవినీతి, అన్యాయాలను ప్రశ్నించిన కొంత మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ నాయకులు అక్రమ కేసులు బనా యిస్తున్నారన్నారు. పట్టణ అధ్యక్షుడు భవానిప్రసాద్, పార్లమెంట్ అధికార ప్రతిని ధి ఆర్జే వెంకటేశ్, రెడ్డిశేఖర్, రాణా, తులసీధర్నాయుడు, లక్ష్మన్న, శ్రీరాములునాయు డు, సూరి, నిస్సార్అహ్మద్, వంటికొండ వెంకటేశ్, కాశీశ్రీరామ్, రమణరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2022-09-30T05:22:58+05:30 IST