ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి
ABN, First Publish Date - 2022-12-01T23:50:28+05:30
బి.కొత్తకోట మండలం బీసీకా లనీ కి చెందిన నారాయణరెడ్డి, అతని కుటుంబ సభ్యులతో తమకు ప్రాణహాని ఉందని బాధితుడు కృష్ణమూర్తి, భార్యాపిల్లలు గురువా రం ఇనచార్జి డీఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు.
డీఎస్పీకి బాధితుల ఫిర్యాదు
మదనపల్లె క్రైం, డిసెంబరు 1: బి.కొత్తకోట మండలం బీసీకా లనీ కి చెందిన నారాయణరెడ్డి, అతని కుటుంబ సభ్యులతో తమకు ప్రాణహాని ఉందని బాధితుడు కృష్ణమూర్తి, భార్యాపిల్లలు గురువా రం ఇనచార్జి డీఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. గతనెల 26న పొలం వద్ద పనులు చేసుకుంటుండగా నారాయణరెడ్డి, అతని కుమా రుడు గోపినాథ్రెడ్డి, మరికొందరు కలసి తనపై మూకుమ్మడిగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారన్నాడు. తనకు బలమైన గాయాలై నా..హత్యాయత్నం కేసునమోదు చేయకుండాఅది కూడా కౌంటర్ కేసులు నమోదు చేసి అన్యాయం చేశారంటూ కృష్ణమూర్తి ఆరోపిం చాడు. దాడికేసును హత్యాయత్నం కేసుగా మార్పుచేసి, నారాయణరెడ్డి కుటుంబం నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ బాధితులు పేర్కొ న్నారు. ఈ మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.
Updated Date - 2022-12-01T23:50:30+05:30 IST