యువకుడి మృతి
ABN, First Publish Date - 2022-01-15T04:46:03+05:30
జమ్మలమడుగు మండలంలోని పర్యాటక ప్రదేశమైన గండికోటలో శుక్రవారం మధ్యా హ్నం వై.సాయికిరణ్రెడ్డి (24) అనే యువకుడు దుర్మరణం చెందాడు.
జమ్మలమడుగు రూరల్, జనవరి 14: జమ్మలమడుగు మండలంలోని పర్యాటక ప్రదేశమైన గండికోటలో శుక్రవారం మధ్యా హ్నం వై.సాయికిరణ్రెడ్డి (24) అనే యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసుల వివరాల మేరకు మృతుడు ప్రొద్దుటూరు పట్టణంలోని కోటవీధికి చెందినవ్యక్తి. ఉదయాన్నే స్నేహితులతో కలిసి గండికోటకు వచ్చారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో గండికోటలోని వా టర్పాల్స్ వద్ద ప్రమాదవశాత్తు నీళ్లలో పడి గల్లంతు అయ్యాడు. గంట తర్వాత శవమై తేలాడు. వెంటనే స్థానికులు మృతదేహా న్ని జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతు డు బీటెక్ విద్యార్థి అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ రఘురాం తెలిపారు.
Updated Date - 2022-01-15T04:46:03+05:30 IST