ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

ABN, First Publish Date - 2022-05-20T05:38:09+05:30

మండల పరిధిలోని కొత్తపుల్లూరు గ్రామానికి చెందిన మద్దెల లక్షుమయ్య (25) అనే యువకుడు గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

మృతిచెందిన లక్షుమయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాజీపేట, మే 19 : మండల పరిధిలోని కొత్తపుల్లూరు గ్రామానికి చెందిన మద్దెల లక్షుమయ్య (25) అనే యువకుడు గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం మేర కు... రూబెన్‌, దీవమ్మ కుమారుడు మద్దెల లక్షుమయ్య పెయింటింగ్‌ పనిచేసేవాడు. ఉదయం బయటకు వెళ్లి మద్యం సేవించి ఇంటికి రావడంతో  దీవమ్మ లక్షుమయ్యను మందలించింది. దీంతో ఆ గ్రామంలోని ఓ వ్యక్తి మద్యం తాపించాడని ఏమీ బాగోలేదని తెలిపాడని దీవమ్మ ఆరోపించింది. మంచంపై పడుకోమని చెప్పి దీవమ్మ పని నిమిత్తం బయటకు వెళ్లింది. అయితే ఇంటికి వచ్చి లక్షుమయ్యను లేపగా లేవకపోవడంతో 105 వాహనానికి సమాచారం అందించారు. అయితే లక్షుమయ్య అప్పటికే మృతి చెందాడు.  సంఘటన స్థలానికి ఎస్‌ఐ కుళాయప్ప చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా లక్షుమయ్య తండ్రి రూబెన్‌ గతంలో అనారోగ్యంతో మృతిచెందాడు. 

Updated Date - 2022-05-20T05:38:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising