ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-01-24T04:57:36+05:30

స్థానిక నెల్లూరు రోడ్డు బైపాస్‌లోని భగత్‌సింగ్‌ నగర్‌ కాలనీలో ఓ ఇంటి ఆవరణలోని చెట్టుకొ మ్మలు కొడుతున్న సమయంలో విద్యుత్‌ తీగల షాట్‌సర్క్యూట్‌తో సత్యం(36) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

మృతుడు సత్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు రూరల్‌, జనవరి 23 : స్థానిక నెల్లూరు రోడ్డు బైపాస్‌లోని భగత్‌సింగ్‌ నగర్‌ కాలనీలో ఓ ఇంటి ఆవరణలోని చెట్టుకొ మ్మలు కొడుతున్న సమయంలో విద్యుత్‌ తీగల షాట్‌సర్క్యూట్‌తో సత్యం(36) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతు డు కాశినాయన మండలం వరికుంట్ల గ్రా మస్తుడు. జీవనోపాదికి బద్వేలు పట్టణాకి వచ్చి భగత్‌సింగ్‌ నగర్‌ కాలనీలో నివాసం ఉంటూ బేల్దారి పనులు చేసుకుంటూ జీవ నం సాగిస్తున్నాడు. ఆదివారం ఓ ఇంటి ఆవరణలో పెరిగిన చెట్టు కొమ్మలను కొడు తున్న సమయంలో విద్యుత్‌ తీగలు తగిలి కరెంట్‌ షాక్‌తో కిందపడ్డాడు. స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార ్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్ద మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర రోధనకు గురయ్యారు. మృతుడి సోదరుడు బాల ఓబయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-01-24T04:57:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising