అగ్నిపఽథ్ పఽథకాన్ని వెంటనే రద్దు చేయాలి
ABN, First Publish Date - 2022-06-29T05:34:36+05:30
అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.షాజహా న్బాషా డిమాండ్ చేశారు.
మదనపల్లె, అర్బన్, జూన్ 28: అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.షాజహా న్బాషా డిమాండ్ చేశారు. మంగళవారం బెంగళూ రు బస్టాండ్లో నిరసన చేప ట్టారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం యువతపై, దేశాన్ని కాపాడే ఆర్మీపట్ల చలగాటం ఆడుతోందని ఆరోపించారు. రేపు ఆర్మీ, న్యావీ, ప్రభుత్వ సంస్థలు లేకుండా చేయాలనేదే ప్రధాని మోదీ ఉద్దేశ్యమని ఆయన ధ్వజమెత్తారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసేంత వరకు పోరాటాలు చేస్తామ న్నారు. కార్యక్రమంలో డీసీసీ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు గిరీష్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగూర్వల్లి, జిల్లా ఉపాధ్యక్షుడు షంషీర్, రెడ్డిసాహెబ్, ఇంతియాజ్, మాజీకౌన్సిలర్ నజీర్, జబీవుల్లా, నిజామ్, పాల్గొన్నారు.
Updated Date - 2022-06-29T05:34:36+05:30 IST