డిపో మేనేజర్ను సస్పెండ్ చేయాలి
ABN, First Publish Date - 2022-05-24T05:07:07+05:30
ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులను అణచివేసేందుకు వివిధ రకాలుగా వేధిస్తున్న జమ్మలమడుగు ఆర్టీసీ డిపో మేనేజర్ను జిల్లా అధికారులు విచారించి వెంటనే సస్పెండ్ చేయాలని డిపో సెక్రటరీ వెంకటేశ్వరరెడ్డి, జాయింట్ సెక్రటరీ రాజశేఖర్రెడ్డి, కార్మికులు డిమాండ్చేశారు.
ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు డిమాండ్
జమ్మలమడుగు రూరల్, మే 23: ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులను అణచివేసేందుకు వివిధ రకాలుగా వేధిస్తున్న జమ్మలమడుగు ఆర్టీసీ డిపో మేనేజర్ను జిల్లా అధికారులు విచారించి వెంటనే సస్పెండ్ చేయాలని డిపో సెక్రటరీ వెంకటేశ్వరరెడ్డి, జాయింట్ సెక్రటరీ రాజశేఖర్రెడ్డి, కార్మికులు డిమాండ్చేశారు. సోమవారం జమ్మలమడుగు ఆర్టీసీ డిపో ఆవరణంలో ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు డిపో మేనేజర్ వేధింపులపై నిరసనగా ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గేట్ సమావేశంలో కార్మికులు, నాయకులు డిపో మేనేజర్ వ్యతిరేక విఽధానాలపై ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా జిల్లా అధికారులు డిపో మేనేజర్ను విచారించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పరమేశ్వరుడు, వాసు, సాయికుమార్, శంకరయ్య, కార్మికులు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-24T05:07:07+05:30 IST