యువకుడి ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-06-30T05:49:33+05:30
కడప నగరం విజయదుర్గా కాలనీ సమీపంలో కంప చెట్టుకు ఉరివేసుకుని మన్నూకుమార్ దాస్ (25) ఆత్మహత్యకు పాల్పడినట్లు తాలూకా ఎస్ఐ హుస్సేన్ తెలిపారు.
కడప(క్రైం), జూన్ 29: కడప నగరం విజయదుర్గా కాలనీ సమీపంలో కంప చెట్టుకు ఉరివేసుకుని మన్నూకుమార్ దాస్ (25) ఆత్మహత్యకు పాల్పడినట్లు తాలూకా ఎస్ఐ హుస్సేన్ తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు... జార్ఖండ్ రాష్ట్రం మధుగడ్ తాలూక సేవాయి కళ గ్రామానికి చెందిన మన్నూకుమార్ దాస్ ప్రొక్లైన్ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. కడప నగరానికి చెందిన శంకర్రెడ్డి వద్ద డ్రైవర్గా పని చేస్తున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేవని ఓనర్కు చెప్పుకొని బాధపడుతుండేవాడని.. ఈ క్రమంలో 28న రాత్రి విజయదుర్గా కాలనీ చివరిలో కంప చెట్టుకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్కు తరలించి, ఓనర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు.
Updated Date - 2022-06-30T05:49:33+05:30 IST