వైభవంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ
ABN, First Publish Date - 2022-10-08T04:43:44+05:30
పట్టణంలోని పట్టాభి రామా లయంలో టీటీడీ ఆధ్వర్యంలో పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు జరగను న్నాయి. ఉత్సవాలకు సంబం ధించి శుక్రవారం అంకు రార్పణ కార్యక్రమం వైభ వంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతసేవ, ఆలయంలో మూలవర్లకు అభిషేకం, తోమాలసేవలతో ప్రత్యేక పూజలు జరిగాయి.
వాల్మీకిపురం, అక్టోబరు 7: పట్టణంలోని పట్టాభి రామా లయంలో టీటీడీ ఆధ్వర్యంలో పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు జరగను న్నాయి. ఉత్సవాలకు సంబం ధించి శుక్రవారం అంకు రార్పణ కార్యక్రమం వైభ వంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతసేవ, ఆలయంలో మూలవర్లకు అభిషేకం, తోమాలసేవలతో ప్రత్యేక పూజలు జరిగాయి. సాయంత్రం ఆలయంలో కలశస్థాపన చేసి, వేదపండితుల మంత్రోచ్ఛరణలు, భక్తజనం నడుమ పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేశారు. కార్యక్రమంలో టీటీడీ సూపరింటెండెంట్ ముని చెంగల్రాయులు, ఆగమ పండితులు మణికంఠ భట్టర్, ఆలయ అధికారి దిశంత్కుమార్, అర్చకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు, కృష్ణప్రసాద్ భట్టర్, భాషికాచార్యులు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉత్సవాలలో నేడు..
పవిత్రోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్నపన తిరుమంజనం, పవిత్రాల ప్రతిష్ఠ, హోమం, పూర్ణాహుతి ప్రత్యేక పూజలు జరగనున్నాయి.
Updated Date - 2022-10-08T04:43:44+05:30 IST