రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక
ABN, First Publish Date - 2022-11-30T23:26:23+05:30
మండలంలోని మల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి మహమ్మద్ యూసఫ్ రాష్ట్ర స్థాయి క్రికెట్కు ఎంపిక కావడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆంజనేయులునాయు డు హర్షం వ్యక్తం చేశారు.
చిన్నమండెం, నవంబరు 30: మండలంలోని మల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి మహమ్మద్ యూసఫ్ రాష్ట్ర స్థాయి క్రికెట్కు ఎంపిక కావడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆంజనేయులునాయు డు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-17 క్రికెట్ విభాగం నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనపర్చి ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని వ్యాయామ ఉపాధ్యాయుడు రామచంద్ర, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ బెల్లం భయ్యారెడ్డి, విద్యార్థిని ఘనంగా సత్కరించారు.
Updated Date - 2022-11-30T23:26:25+05:30 IST