రాజంపేట సబ్కలెక్టర్ అనంతపురం జేసీగా బదిలీ
ABN, First Publish Date - 2022-01-23T05:19:31+05:30
రాజంపేట సబ్కలెక్టర్ కేతన్గార్గ్ అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. ఈ మేరకు అనంతపురం జిల్లా రైతు భరోసా జేసీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
రాజంపేట, జనవరి 22: రాజంపేట సబ్కలెక్టర్ కేతన్గార్గ్ అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. ఈ మేరకు అనంతపురం జిల్లా రైతు భరోసా జేసీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. 2018 ఐఏఎస్ క్యాడర్కు చెందిన ఈయన 2020 ఆగస్టులో రాజంపేట సబ్కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా గట్టి చర్యలు చేపట్టారు. అట్టడుగు వర్గాల రెవెన్యూ సమస్యల పరిష్కారంలో తనదైన పాత్ర పోషించారు. చెయ్యేరు వరదతో దెబ్బతిన్న గ్రామాల్లో బాధితులకు సత్వర సహాయం అందడంలో విశేష కృషి చేశారు.
రాజంపేట ఆర్డీవోగా కోదండరామిరెడ్డి.. ?
రాజంపేట ఆర్డీవోగా కోదండరామిరెడ్డిని నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈయన చిత్తూరు జిల్లా అటవీశాఖ సెటిల్మెంట్ అధికారిగా పనిచేస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజంపేట తహసీల్దారుగా ఏడాదిపాటు పనిచేశారు. ఏదైనా రాజకీయ సమీకరణాలు మారితే తప్ప కోదండరామిరెడ్డినే రాజంపేట ఆర్డీవోగా నియమించే అవకాశాలున్నట్లు సమాచారం.
Updated Date - 2022-01-23T05:19:31+05:30 IST