రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలి
ABN, First Publish Date - 2022-01-26T05:29:51+05:30
రాజంపేటను అన్నమయ్య జిలా ్లగా ప్రకటించాలని పేర్కొంటూ పలు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
రాజంపేట, జనవరి 25: రాజంపేటను అన్నమయ్య జిలా ్లగా ప్రకటించాలని పేర్కొంటూ పలు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజంపేటలో మంగళవారం పలు సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజంపేట పట్టణ సంఘ సంస్కర్త అల్లం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తొలి పదకవితా పితామహుడు అన్నమాచార్యులు జన్మస్థలి ప్రాంతమైన రాజంపేటను ఆయన పేరిట అన్నమయ్య జిల్లాగా మారిస్తే అందరూ హర్షిస్తారన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు ముద్దా ఆదిశేషారెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర అదనపు కార్యదర్శి వై.సుబ్రహ్మణ్యంరాజులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి న విధంగా ప్రతి పార్లమెంట్ కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని చెప్పిన విధంగా రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలన్నారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు నరసింహ, సురేంద్ర, సుధాకర్, స్వామినాధ్, చంద్రశేఖర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-26T05:29:51+05:30 IST