ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల కష్టాలను వివరించిన ‘వాన మెతుకులు’

ABN, First Publish Date - 2022-04-25T04:58:33+05:30

వానమెతుకులు కథా సంకలనంలో రైతుల కన్నీళ్లు, కష్టాలను కళ్లకు కట్టినట్లుగా రాశారని శతావధాని నరాల రామారెడ్డి పేర్కొన్నారు.

వానమెతుకులు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు టౌన్‌, ఏప్రిల్‌ 24 : వానమెతుకులు కథా సంకలనంలో రైతుల కన్నీళ్లు, కష్టాలను కళ్లకు కట్టినట్లుగా రాశారని శతావధాని నరాల రామారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వానమెతుకులు కథా సంకలనం పుస్తక పరిచయ సభను ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 మంది రచయితలు రాసిన రాయలసీమ రైతుల కథలను రచయితలు ఇనాయతుల్లా, రామమోహన్‌ వానమెతుకుల పేరుతో సంకలనం చేయడం అభినందనీయమన్నారు. వీరిలో కాశీవరపు వెంకటసుబ్బయ్య కథ ’పెన్నేటి బతుకు‘కు అవకాశం కల్పించారన్నారు. ఈ కథలో రైతుల కష్టాలను చక్కగా వివరించారన్నారు. రచయిత డీకే చదువుల బాబు మాట్లాడుతూ రైతుల పతనానికి ప్రృకతితోపాటు కల్తీ విత్తనాలు, నకిలీ ఎరువులు, దళారులు, వడ్డీ వ్యాపారులు వంటి కారణాలను మనసుకు హత్తుకునేలా రచించారన్నారు. అనంతరం కాశీవరపు వెంకటసుబ్బయ్యను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రచయితలు మహమ్మద్‌, ఎన్‌ఎస్‌ ఖలందర్‌, కామనూరు రామమోహన్‌, పల్లా కృష్ణ, కొత్తపల్లి శ్రీను, గోపాల్‌నాయక్‌, పల్లా రామారావు, పుత్తూరు సుబ్రహ్మణ్యం, చాడా మునిశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-04-25T04:58:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising