ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అందించండి

ABN, First Publish Date - 2022-08-10T04:34:11+05:30

రాష్ట్రంలోని ఉర్దూ మీడియం ఎస్‌ఎ్‌ససీ విద్యార్థులకు మైనార్టీ సంక్షేమ శాఖ విభాగం సీఈడీఎం ఆధ్వర్యంలో ఉచితంగా స్టడీ మెటీరియల్‌ అందించాలని రాష్ట్ర ఉర్దూ టీచర్స్‌ అసోసియేషన(రూటా) వ్యవస్థాపకుడు సయ్యద్‌ హిదాయతుల్లా, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ముహమ్మద్‌ అయ్యూబ్‌ డిమాండ్‌ చేశారు.

ఉప ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పిస్తున్న రూటా నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషాకు రూటా వినతి 

కడప(ఎడ్యుకేషన), ఆగస్టు 9 : రాష్ట్రంలోని ఉర్దూ మీడియం ఎస్‌ఎ్‌ససీ విద్యార్థులకు మైనార్టీ సంక్షేమ శాఖ విభాగం సీఈడీఎం ఆధ్వర్యంలో ఉచితంగా స్టడీ మెటీరియల్‌ అందించాలని రాష్ట్ర ఉర్దూ టీచర్స్‌ అసోసియేషన(రూటా) వ్యవస్థాపకుడు సయ్యద్‌ హిదాయతుల్లా, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ముహమ్మద్‌ అయ్యూబ్‌ డిమాండ్‌ చేశారు. కడప నగరం ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషాకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర ్భంగా హిదాయతుల్లా మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థుల పరీక్షల సన్నద్దం కోసం స్టడీ మెటీరియల్‌ ఎంతో ఉపయోగపడుతుందని, వీలైనంత త్వరగా అందించాలని కోరారు. స్పందించిన అంజద్‌బాషా ఎస్‌ఎ్‌ససీ మెటీరియల్‌ తయారు చేసి అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరీ కమిటీ చైర్మన హాజీ అబ్దుల్‌ హకీమ్‌ సాహెబ్‌, డైరీ కో చైర్మన సయ్యద్‌ సిరాజుద్దీన, జిల్లా అధ్యక్షుడు ముహమ్మద్‌ ఇర్షాద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి జాకీర్‌ హుస్సేన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T04:34:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising