నల్లజెండాలతో నిరసన, ర్యాలీ
ABN, First Publish Date - 2022-08-11T05:02:23+05:30
జమ్మలమడుగు పట్టణంలో బుధవారం నల్లజెండాలు, బ్యాడ్జీలు ధరించి ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన చేపట్టారు.
జమ్మలమడుగు రూరల్, ఆగస్టు 10: జమ్మలమడుగు పట్టణంలో బుధవారం నల్లజెండాలు, బ్యాడ్జీలు ధరించి ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన చేపట్టారు. ముందు గా వారు డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ విగ్రహం వద్ద నుంచి పట్టణంలో పాత బస్టాండు, పోలీసు స్టేషన్ ఎదురుగా అంబేడ్కర్ విగ్రహం వరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఎస్సీ వర్గీకరణ పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరశిస్తూ ఎంఎ్సపీ, ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జమ్మలమడుగు తహసీల్దారు రవీంద్రారెడ్డికి వారు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు చిన్నయ్య, నరసింహులు, చంద్రకుమార్, శ్రీనివాసులు, పుల్లన్న, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-11T05:02:23+05:30 IST