ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలిసి పోరాడితేనే సమస్యలు పరిష్కారం

ABN, First Publish Date - 2022-05-16T05:30:00+05:30

విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కా రం కావాలంటే కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని విద్యుత్‌ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ జనరల్‌ సెక్రటరీ ప్రతాప్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ఆర్టీపీపీ వద్ద ఉద్యోగుల ధర్నాలో మాట్లాడుతున్న రాష్ట్ర జేఏసీ జనరల్‌ సెక్రటరీ ప్రతాప్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేఏసీ జనరల్‌ సెక్రటరీ ప్రతాప్‌రెడ్డి

వేతనాలకోసం కొనసాగిన ఆందోళన


ఎర్రగుంట్ల, మే 16: విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కా రం కావాలంటే కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని విద్యుత్‌ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ జనరల్‌ సెక్రటరీ ప్రతాప్‌రెడ్డి పిలుపునిచ్చారు.  వేతనాలకోసం ఆర్టీపీపీలో కొనసాగుతున్న ధర్నాలో ఆయన సోమవారం ఉదయం 9.30 గంటలకు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం విద్యుత్‌ ఉద్యోగుల పరిస్థితి దృష్ట్యా విడివిడిగా ఆందోళన చేయడం సరికాదన్నారు. ఇది యాజమాన్యానికి అనుకూలం అవుతుందే తప్ప ఉపయోగం లేదన్నారు. ఉద్యోగుల సమ స్యలు పరిష్కారం కావాలంటే ముందుగా సంస్థను రక్షించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏదో ఒక యూనియన్‌, ఒక నాయకునిపై కోపంతో జేఏసీతో కాకుండా విడివిడిగా ఆందో ళనలు చేయవద్దని సూచించారు. కలిసికట్టుగా ఉండాలని, ఇప్పుడున్న యూనియన్‌ నాయకులపై పరిష్కారంకోసం ఒత్తిడి తేవాలన్నారు. అలా కాకుండా ఎవరికివారు విడిపోతే మన కన్నును మనమే పొడుచుకున్నట్లు ఉంటుందన్నారు. జీతాలు పడతాయని ఆందోళన ఆపాలని ఆయన ధర్నా చేస్తు న్నవారికి సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌64 నాయ కుడు పి.శివయ్య, హెచ్‌ 129 గిరిబాబు, టీఎన్‌వీకేఎస్‌ వీరా రెడ్డి, గంగాధర్‌, పార్థసారధినాయుడు, జగదీష్‌రెడ్డి, ఎస్‌.నూర్‌ బాషా, కొండారెడ్డి, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. కాగా.. సోమవారం మధ్యాహ్నం ఉద్యోగులకు జీతాలు పడ్డాయి. 

Updated Date - 2022-05-16T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising