ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కార్యవర్గం
ABN, First Publish Date - 2022-05-29T04:34:21+05:30
ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం అన్నమయ్య జిల్లా నూతన కార్యవర్గాన్ని శనివారం రాయచోటి పట్టణంలోని డైట్ విద్యా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
రాయచోటి టౌన్, మే 28: ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం అన్నమయ్య జిల్లా నూతన కార్యవర్గాన్ని శనివారం రాయచోటి పట్టణంలోని డైట్ విద్యా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ప్రధానోపాధ్యాయుల సంఘం వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్నమయ్య జిల్లా గౌరవాధ్యక్షుడిగా సంబేపల్లె జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు మడితాటి నరసింహారెడ్డి, అధ్యక్షుడిగా రాయచోటి మండలం మాధవరం జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కానాల నాగమునిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లె జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు నాగసుబ్బరాయుడును ఎంపిక చేశారు. అలాగే జిల్లా కోశాధికారిగా సంబేపల్లె మండలం పెద్దజంగంపల్లె హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు సుంకర రామకృష్ణ, రాష్ట్ర కౌన్సిలర్స్గా వైసీ రెడ్డెప్పరెడ్డి, రమణయ్యశెట్టి, చిట్టిబాబు, హెడ్క్వార్టర్స్ కార్యదర్శిగా జయచంద్ర, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా వంగిమళ్ల వేణుగోపాలరావు, ఆడిట్ కమిటీ సభ్యుడిగా నారాయణరెడ్డి, మహిళా ప్రతినిధులుగా సుధారాణి, చంద్రకళలను ఎంపిక చేశారు. అలాగే రాయచోటి డివిజన్ అధ్యక్షుడిగా ఆంజనేయులునాయుడు, కార్యదర్శిగా జయన్న, మదనపల్లె డివిజన్ అధ్యక్షుడిగా సుబ్బారెడ్డి, కార్యదర్శిగా శివయ్య, రాజంపేట డివిజన్ అధ్యక్షుడిగా సుబ్బరాయుడు, కార్యదర్శిగా నాగ తిరుమలరావును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఎన్నికల అధికారిగా ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీవీ నారాయణరెడ్డి వ్యవహరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుల సంఘం కడప జిల్లా కార్యదర్శి నరసింహశాస్త్రి, అన్నమయ్య జిల్లాలోని వివిధ మండలాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-29T04:34:21+05:30 IST