ఆర్టీసీ బస్సులో నుంచి పడి వృద్ధురాలికి గాయాలు
ABN, First Publish Date - 2022-08-16T05:23:18+05:30
ఆళ్లగడ్డ నుంచి మైదుకూరుకు వెళ్లే ఆర్టీసీ బస్సులో నుంచి కర్నూలుజిల్లా నొస్సం గ్రామానికి చెందిన సారెమ్మ అనే వృద్ధురాలు కిందపడి గాయాల య్యాయి.
దువ్వూరు, ఆగస్టు 15: ఆళ్లగడ్డ నుంచి మైదుకూరుకు వెళ్లే ఆర్టీసీ బస్సులో నుంచి కర్నూలుజిల్లా నొస్సం గ్రామానికి చెందిన సారెమ్మ అనే వృద్ధురాలు కిందపడి గాయాల య్యాయి. బంధువుల వివరాల మేరకు... నొస్సం గ్రామానికి చెందిన సారెమ్మ కడపకు వెళుతుండగా ఆళ్లగడ్డలో మైదుకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఎక్కిందన్నారు. గుడిపాడు వద్దకు రాగానే ఒక్కసారిగా అత్యవసర కిటికీ తలుపు కిందపడటంతో పక్కనే ఉన్న సారెమ్మ రోడ్డుపై పడింది. ఈ ఘటనలో సారెమ్మ తలకు తీవ్ర గాయాలు కావడంతో కడప రిమ్స్కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దువ్వూరు ఎస్ఐ కేసీ రాజు పేర్కొన్నారు.
Updated Date - 2022-08-16T05:23:18+05:30 IST