ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ

ABN, First Publish Date - 2022-01-22T05:24:34+05:30

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేస్తున్న ఏఐటీయూసీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(రవీంద్రనగర్‌), జనవరి 21: మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ సెక్రటరి కేసీ బాదుల్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీని విడుదల చేయాలని, మున్సిపల్‌ ఒప్పంద పారిశుధ్య ఇంజనీరింగ్‌ స్కూల్‌ స్వీపర్లను పర్మినెంట్‌ చేయాలని, సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రిటైర్డ్‌ కార్మికుల బెనిఫిట్స్‌ విడుదల చేయాలని, కొవిడ్‌ వల్ల మరణించిన కార్మికులకు రూ.50 లక్షలు చెల్లించాలన్నారు. వెంటనే మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ ఆయుబ్‌ఖాన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి మద్దిలేటి, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నగర అధ్యక్ష కార్యదర్శి నరసింహ, తారకరామారావు, వెంకటాద్రి, చంద్ర, జనార్థన్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T05:24:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising