రాజ్యాంగ విలువల పరిరక్షణకు ఉద్యమించాలి
ABN, First Publish Date - 2022-08-14T05:28:52+05:30
బీజేపీ పాలనలో రాజ్యాంగ విలువలు కాపాడడం కోసం ప్రజలు అందరూ ఐక్యంగా ఉద్య మించాలని సీపీఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
మదనపల్లె అర్బన్, ఆగస్టు 13: బీజేపీ పాలనలో రాజ్యాంగ విలువలు కాపాడడం కోసం ప్రజలు అందరూ ఐక్యంగా ఉద్య మించాలని సీపీఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం సీపీఎం ఆధ్వర్యంలో 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడులకను పురస్కరించుకుని స్వాతంత్య్ర పోరాట స్పూర్తితో భారతరా జ్యాంగం కాపాడుకుంద్దాం అంటూ నినాదాలు చేస్తూ పట్టణంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఇది ఆర్టీసీ బస్టాండ్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు సాగింది. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ స్వాతంత్య్ర ఫలాలను భారతదేశంలో ప్రజలకు బీజేపీ దక్కనీయడం లేదన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ప్రభాకర్రెడ్డి, హరీంద్ర నాధ్శర్మ, నాగరాజు, వెంకటేష్, ఆటో యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు, చాన్బా షా, మల్లయ్య, రెడ్డెప్ప, యల్లప్ప పాల్లొన్నారు.
Updated Date - 2022-08-14T05:28:52+05:30 IST