సొంత గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే
ABN, First Publish Date - 2022-01-17T05:11:19+05:30
రైల్వేకోడూరు ఎమ్మెల్యే, విప్ కొరముట్ల శ్రీనివాసులు ఆదివారం తన స్వగ్రామైన రెడ్డివారిపల్లెలో పర్యటించారు.
రైల్వేకోడూరు, జనవరి 16: రైల్వేకోడూరు ఎమ్మెల్యే, విప్ కొరముట్ల శ్రీనివాసులు ఆదివారం తన స్వగ్రామైన రెడ్డివారిపల్లెలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రోడ్లపై ప్రవహిస్తున్న మురికినీరు, తదితర సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంటనే డ్రైనేజీ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించి, సమస్యను పరిష్కరిస్తామని ప్రజలకు హమీ ఇచ్చారు. అనంతరం ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. కార్యక్రమంలో రైల్వేకోడూరు ఉప సర్పంచ్ తోట శివసాయి, వైసీపీ నేతలు శ్రీకారపు శివయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-17T05:11:19+05:30 IST