ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాన్యాలున్నా.. నైవేద్యానికీ కరువే!

ABN, First Publish Date - 2022-08-17T04:30:52+05:30

మాన్యాలున్నా పలు ఆలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఏటేటా భూముల ద్వారా వస్తున్న ఆదాయాన్ని తన ఖాతా లో జమ చేసుకుంటున్న రాష్ట్ర దేవదాయ శాఖ ఆలయాల అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయడం లేదనడానికి బీ. యర్రగుడి గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం సాక్ష్యంగా నిలుస్తోంది.

లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్కిరెడ్డిపల్లె, ఆగస్టు 14: మాన్యాలున్నా పలు ఆలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఏటేటా భూముల ద్వారా వస్తున్న ఆదాయాన్ని  తన ఖాతా లో జమ చేసుకుంటున్న రాష్ట్ర దేవదాయ శాఖ ఆలయాల అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయడం లేదనడానికి బీ. యర్రగుడి గ్రామంలోని  లక్ష్మీనరసింహస్వామి ఆలయం సాక్ష్యంగా నిలుస్తోంది. చోళుల కాలంనాటి ఈ ఆలయానికి   35 ఎకరాల మాన్యం ఉంది. ఏడాదికోసారి ఈ భూములను దేవదాయ శాఖ వేలం వేస్తు న్నా  ఇక్కడ పనిచేస్తున్న అర్చకుడికి మాత్రం ఇప్పటికీ నెలకు రూ.200 గౌరవ వేతనం మాత్ర మే ఇస్తున్నారు. ఈ మొత్తం ఎందుకూ చాలక పోవడంతో,   పౌరోహిత్యం చే యడం ద్వారా వచ్చిన ఆదాయంతో ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నానని అ ర్చకుడు చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆలయం క్రమేణా శిథిలావస్థకు చేరుకుంటోంది. పైకప్పు కారుతుండడంతో  ఉత్సవ విగ్రహాలను భద్రపరచడానికి కూడా స్థలం లేకుండా పో యిందని అర్చకుడు చెబుతున్నారు. గతంలో ఈ ఆలయంలో నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాలకు చక్రాయపేట, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేవారు. గుడి ఽశిథిలావస్థకు చేరుకోవడంతో రాను రాను భక్తులు రావడం మానేశారు. ఇప్పటికైనా అధికారులు స్పం దించి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - 2022-08-17T04:30:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising