ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఎమ్మెల్సీగా రామ్‌గోపాల్‌రెడ్డిని గెలిపించుకుందాం’

ABN, First Publish Date - 2022-10-04T05:17:08+05:30

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు బలపర్చిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్‌గోపాల్‌రెడ్డిని గెలిపించుకుందామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులకు పిలుపునిచ్చారు.

నిరసన తెలుపుతున్న ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచోటిటౌన్‌, అక్టోబరు 3 : టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు బలపర్చిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్‌గోపాల్‌రెడ్డిని గెలిపించుకుందామని టీడీపీ రాష్ట్ర  కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన రాయచోటి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ పట్టభద్రులందరూ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. వైసీపీకి గుణపాఠం చెప్పాలంటే రామ్‌గోపాల్‌రెడ్డి గెలుపు అవసరమన్నారు. అందుకోసం పట్టభద్రులైన వారు తమ ఓటును నమోదు చేసుకోవాలన్నారు. చిన్నమండెం మండలం టీడీపీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, రాజంపేట పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి చింతం హరి అమర్‌నాథరెడ్డి, సంబేపల్లె మండల టీడీపీ అధ్యక్షులు రెడ్డెయ్యయాదవ్‌, మోటకట్ల సుబ్బారెడ్డి, రాయచోటి మండల టీడీపీ అద్యక్షులు మురికినాటి వెంకటసుబ్బారెడ్డి, రాజంపేట పార్లమెంట్‌ మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు అబూజర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-04T05:17:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising