పాదయాత్రకు కార్మిక వర్గం సంపూర్ణ మద్దతు
ABN, First Publish Date - 2022-12-07T00:09:41+05:30
కడప ఉక్కు ఫ్యాక్టరీ ని ర్మాణానికి సీపీఐ పాదయాత్రకు కార్మికవర్గం పాల్గొని జయప్రదం చేయాలని రైల్వే గూడ్స్ హమాలీ వర్కర్స్ యూనియన (ఎఐటియుసి) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కేసీ బాదుల్లా, ఎస్.మహబూబ్బాషలు విజ్ఞప్తి చేశారు.
కడప (సెవెనరోడ్స్), డిసెంబరు 6 : కడప ఉక్కు ఫ్యాక్టరీ ని ర్మాణానికి సీపీఐ పాదయాత్రకు కార్మికవర్గం పాల్గొని జయప్రదం చేయాలని రైల్వే గూడ్స్ హమాలీ వర్కర్స్ యూనియన (ఎఐటియుసి) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కేసీ బాదుల్లా, ఎస్.మహబూబ్బాషలు విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్థాని క రైల్వేస్టేషన ఆవరణంలో యూనియన కార్యాలయం వ ద్ద ఉక్కు పరిశ్రమ పాదయాత్రలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరువు విలయతాండవం చేస్తున్న నేపధ్యంలో యువత, కార్మికుల ఉద్యోగావకాశాలు కల్పించే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కేవలం శంకుస్తాపనలకే సరిపోయిందన్నారు. పార్లమెంటు సాక్షిగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. రైల్వే గూడ్సు షెడ్ హమాలీ వర్కర్స్ యూ నియన నాయకులు టి.పాలయ్య, శ్రీను, చిన్న ఓబులేసు, గంగయ్య, సూరి, సుబ్బరామ్, నాగేంద్ర పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T00:09:45+05:30 IST