ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీమ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంలో జగన్‌ విఫలం

ABN, First Publish Date - 2022-08-11T05:41:48+05:30

రాయలసీమలోని పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో జగన్‌ సర్కార్‌ విఫలం అయ్యిందని తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు లింగారెడ్డి


కడప (మారుతీనగర్‌), ఆగస్టు 10 : రాయలసీమలోని పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో జగన్‌ సర్కార్‌  విఫలం అయ్యిందని తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్న బతుకులు దయనీయంగా మారుతున్నా జగన్‌సర్కార్‌కు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు.  సీమ ప్రాజెక్టులే కాకుండా రాష్ట్రంలోని ఇతర  నీటి పారుదల ప్రాజెక్టులు మూడేళ్లుగా ఎటువంటి అభివృధ్ది లేక లక్షలాది క్యూసెక్కుల నీరు కృష్ణా, గోదావరి నదుల ద్వారా సముద్రం పాలవుతున్నా వాటిని ఒడిసిపట్టడంలో జగన్‌రెడ్డి సర్కార్‌ చేతులెత్తేసిందని నిప్పులు చెరిగారు.  యుద్ధప్రాతిపదికన రాయలసీమ పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. టీటీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్‌. గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ  గత మూడు సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్కసారి కూడా ప్రాజెక్టుల తీరుతెన్నుల గురించి వాకబుచేసిన పాపాన పోలేదన్నారు. సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వికా్‌సహరి, జయకుమార్‌, శ్రీనివాసులు, ఖాజాపీర్‌, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-11T05:41:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising