గ్రామీణ విద్యార్థులకు బడులు దూరం చేస్తే ఊరుకోం
ABN, First Publish Date - 2022-07-19T04:37:02+05:30
నిరుపేద విద్యార్థుల అ భ్యున్నతి కోసం గతంలో చంద్రబాబు నాయుడు ప్రతి పల్లెకు ఒక బడిని ఏర్పాటు చేశారని ప్రస్తు తం ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఉన్న పాఠ శాలలు ఎత్తివేసి గ్రామీణ నిరుపేద విద్యార్థులకు వి ద్యను దూరం చేస్తున్నాడని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి విమర్శించారు.
లక్కిరెడ్డిపల్లె, జూలై18: నిరుపేద విద్యార్థుల అ భ్యున్నతి కోసం గతంలో చంద్రబాబు నాయుడు ప్రతి పల్లెకు ఒక బడిని ఏర్పాటు చేశారని ప్రస్తు తం ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఉన్న పాఠ శాలలు ఎత్తివేసి గ్రామీణ నిరుపేద విద్యార్థులకు వి ద్యను దూరం చేస్తున్నాడని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి విమర్శించారు. సోమవారం లక్కిరెడ్డిపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నాయు డు హయాంలో ప్రతి గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేసి ఉపాధ్యాయులను నియ మించి నిరుపేదలకు విద్యనందించారన్నారు. విద్యా ప్రమాణాలను కాలరాస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయుల జీవితాలతో ఆడుకుంటు న్నారన్నారు. ఈ కార్యక్రమంలో బూడిదగుంటపల్లె ఎంపీటీసీ సభ్యుడు రెడ్డిశేఖర్, మాజీ సర్పంచులు రెడ్డెన్న, శ్రీనివాసులు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు చెండ్రాయుడు, బీసీ సెల్ నియోజకవర్గ కార్యదర్శి గంగయ్య, టీడీపీ నాయకులు వెంకట్రామరాజు, దిలీప్రాజు, వేమయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-07-19T04:37:02+05:30 IST