ఇంటి నిర్మాణాలు వేగవంతంగా చేపట్టాలి
ABN, First Publish Date - 2022-07-01T04:55:58+05:30
లబ్ధిదారులు వారి వారి స్థలాల్లో ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టాలని కమిషనర్ వెంకటరామిరెడి ్డ సూచించారు.
కమిషనర్ వెంకటరామిరెడ్డి
జమ్మలమడుగు రూరల్, జూన్ 30: లబ్ధిదారులు వారి వారి స్థలాల్లో ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టాలని కమిషనర్ వెంకటరామిరెడి ్డ సూచించారు. గురువారం జమ్మలమడుగు మండలంలోని అంబవరం పాలిటెక్నిక్ కళాశాల జగనన్న కాలనీలో లబ్ధిదారులకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కమిషనర్ లబ్ధిదారులతో మాట్లాడారు. ఇటీవల వరుసగా డ్వాక్రా గ్రూపు మహిళలకు ఇంటి నిర్మాణంకోసం రూ.35 వేలు డబ్బులు అందజేశామన్నారు. అందులో భాగంగా సమావేశంలో పది మంది లబ్ధిదారులకు రూ.35 వేలు చొప్పున అందజేశారు. అలాగే స్థల పత్రాలను అందజేశారు. హౌసింగ్ డీఈ గోరంట్లయ్య, మెప్మా అధికారి గంగులయ్య, హౌసింగ్ ఏఈ ఓబులేసు, మెప్మా సిబ్బంది ఉషా, మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2022-07-01T04:55:58+05:30 IST